Fri Dec 05 2025 13:17:15 GMT+0000 (Coordinated Universal Time)
18 ఏళ్లుగా దక్కని ఫలితం.. ఏడ్చేసిన ప్రీతి జింటా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ శిబిరంలో ఆనందం సొంతమైంది. మొదటి టైటిల్ గెలవాలని అనుకున్న పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఓటమి అనంతరం భావోద్వేగానికి గురయ్యారు.
మ్యాచ్ ఓటమి తర్వాత ప్రీతి జింటా కన్నీరు పెట్టుకున్నారు. తెల్ల కుర్తా, ఎరుపు దుపట్టా, సల్వార్ ధరించిన ప్రీతి విచారంగా ఉన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్ తర్వాత ఆమె ముఖంలో నిరాశ కనిపించింది. శ్రేయర్ అయ్యర్తో సహా చాలా మంది ఆటగాళ్లను ప్రీతి ఓదార్చింది.
Next Story

