Wed Apr 24 2024 16:44:54 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కీలక పోరు
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో భాగంగా భారత్ ఈరోజు ఆస్ట్రేలియాతో తలపడుతుంది
భారత మహిళ జట్టు నేడు కీలక పోరును ఎదుర్కొంటోంది. ఆస్టేలియా జట్టుపై పోరాడుతుంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో భాగంగా భారత్ ఈరోజు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు అత్యధిక స్కోరు చేస్తేనే విజయం దక్కుతుంది. మహిళల ప్రపంచ కప్ లో ఇప్పటికే భారత్ జట్టు రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది.
నాలుగో స్థానం చేరాలంటే...
నాలుగు పాయింట్లతో ఉన్న మిథాలీ సేన నాలుగోస్థానానికి చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి, న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలయిన భారత మహిళల జట్టు ఈ మ్యాచ్ లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. అవతల బలమైన జట్టు ఆస్ట్రేలియా ఉండటంతో ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.
Next Story