Fri Mar 20 2026 08:24:45 GMT+0530 (India Standard Time)
భారత్ విజయ లక్ష్యం ఎంతంటే?
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 279 పరుగులు లక్ష్యంగా ఉంది. దక్షిణాఫ్రికా యాభై ఓవర్లలో 178 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 279 పరుగులు లక్ష్యంగా ఉంది. దక్షిణాఫ్రికా యాభై ఓవర్లలో 178 పరుగులు చేసింది. భారత్ ఇప్పుడు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. భారత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ కు మూడు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, అహ్మద్, కుల్దీప్, శార్దూల్ కు తలో వికెట్ లభించింది. ఏడు వికెట్లకు దక్షిణాఫ్రికా 278 పరుగులు చేయగలిగింది.
భారత్ బ్యాటర్లు...
వీరిలో మార్ క్రమ్ 79, హెండ్రిక్స్ 74, మిల్లర్ 35 అత్యధిక పరుగులు చేశారు. భారత్ బ్యాటర్లు ఓవర్ కు దాదాపు 5.6 పరుగులు చేయాల్సి ఉంది. తొలి వన్డేలో ఓటమి పాలయిన భారత్ ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలిస్తేనే సిరీస్ లో సమం అవుతుంది. తర్వాత జరిగే మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది. మరి భారత్ బౌలర్లు ఏ మేరకు రాణిస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story

