Sun May 19 2024 17:00:05 GMT+0000 (Coordinated Universal Time)
సిరీస్ మనదే
మూడో టీ 20లో టీం ఇండియా భారీ స్కోర్ చేయడంతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వన్ సైడ్ గా మారింది. భారీ విజయం సాధించింది
సిరిస్ మనదే.. యువ ఆటగాళ్లు చెలరేగి ఆడారు. మూడో టీ 20లో టీం ఇండియా భారీ స్కోర్ చేయడంతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వన్ సైడ్ గా మారింది. భారీ విజయం సాధించింది. 91 పరుగుల తేడాతో ఇండియా విక్టరీ కొట్టింది. దీంతో 2 -1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన టీం ఇండియా తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. 229 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో...
అయితే తర్వాత బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 137 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఎవరూ పెద్దగా నిలకడగా ఆడలేకపోయారు. అందరూ వరస పెట్టి పెవిలియన్ దారి పట్టడంతో టీం ఇండియా గెలుపు ఎప్పుడో ఖాయమయింది. సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడి 112 పరుగులు చేసి భారత్ కు భారీ పరుగులను సాధించి పెట్టాడు. సూర్య దెబ్బకు శ్రీలంక బౌలర్లు కుదేలయిపోయారు.
Next Story