Tue Feb 03 2026 08:26:59 GMT+0000 (Coordinated Universal Time)
హమ్మయ్య .. రాహుల్ లైన్ లో కొచ్చాడు
భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న టీ 20 మ్యాచ్ లో టీం ఇండియా భారీ స్కోరు దిశగానే పయనిస్తుంది.

భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న టీ 20 మ్యాచ్ లో టీం ఇండియా భారీ స్కోరు దిశగానే పయనిస్తుంది. తొలి ఓవర్లలోనే కెప్టెన్ రోహిత్ శర్మ అవుటయినా కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లిలు నిలకడగా ఆడుతున్నారు. ఇద్దరు కలసి యాభై పరుగుల భాగస్వామ్యం చేశారు.
యాభై దాటగానే...
కేఎల్ రాహుల్ తన అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 31 పరుగుల్లో యాభై పరుగులు చేసిన రాహుల్ సిక్సర్లు, ఫోర్లతో బెంబేలెత్తించి చివరకు యాభై పరుగుల వద్ద అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ 10 ఓవర్లకు 86 పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయింది. క్రీజ్ లో విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్ లు ఉన్నారు.
- Tags
- india
- bangladesh
Next Story

