Fri Dec 05 2025 16:35:00 GMT+0000 (Coordinated Universal Time)
తొలుత బ్యాటింగ్ భారత్ దే
చివరి టీ 20 మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. తొలుత శ్రీలంక బౌలింగ్ చేయనుంది.

చివరి టీ 20 మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. తొలుత శ్రీలంక బౌలింగ్ చేయనుంది. కాసేపట్లో రాజ్కోట్ వేదికగా భారత్ - శ్రీలంక చివరి టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లో చెరొకటి సొంతం చేసుకుని సమంగా నిలిచాయి.
ఓపెనర్లు ఇద్దరూ...
ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు మ్యాచ్ లలో ఓపెనర్లు ఇద్దరూ విఫలమయ్యారు. నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్ లోనైనా ఓపెనర్లు నిలకడగా ఆడాలని, భారత్ భారీ స్కోర్ చేయగలిగితేనే శ్రీలంకను కట్టడి చేయడం సాధ్యమవుతుంది. లేకుంటే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.
Next Story

