Fri Apr 19 2024 22:41:05 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... టీ 20 మ్చాచ్ లు
క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. టీ 20 ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లకు షెడ్యూల్ విడుదలయింది.
క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. టీ 20 ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లకు షెడ్యూల్ విడుదలయింది. ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి టీ 20 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. నవంబరు 13వ తేదీ వరకూ మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 12 మ్యాచ్ లు జరుగుతాయి. రెండు గ్రూపులుగా విభజించి టీ 20 మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా వేదికగా ఈసారి టీ 20 వరల్డ్ కప్ లు మ్యాచ్ లు జరగనున్నాయి.
పాక్ తో భారత్....
గ్రూప్ ఏలో ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్థాన్ గ్రూపు బిలో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ లు ఉన్నాయి. అయితే క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూసే పాక్ - భారత్ మ్యాచ్ నవంబరు 23న జరగనుంది. నవంబరు 9వ తేదీన తొలి సెమి ఫైనల్, 10న రెండో సెమి ఫైనల్, 13న ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మ్యాచ్ ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story