Sun Dec 14 2025 01:50:47 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నాలుగో టీ 20.. రాజ్కోట్ లో రాణించేనా?
భారత్ - దక్షిణాఫ్రికా నాలుగో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. రాజ్ కోట్ లో ఈ మ్యాచ్ జరగనుంది.

భారత్ - దక్షిణాఫ్రికా నాలుగో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. రాజ్ కోట్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2 - 1 గా ఉండటంతో ఈ మ్యాచ్ భారత్ కు సవాల్ గా మారనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే 2. -2 సమం చేసే వీలుంది. లేదంటే దక్షిణాఫ్రికా సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. విశాఖపట్నంలో గెలిచిన టీం ఇండియా రాజ్ కోట్ లోనూ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
బ్యాటింగ్ కు అనుకూలం...
రాజ్ కోట్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. భారీ స్కోర్ నమోదయ్యే అవకాశముంది. విశాఖపట్నం మ్యాచ్ లో బౌలర్ ఆవేశ్ ఖాన్ గాయపడటంతో అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ కు కాని, ఉమ్రాన్ ఖాన్ కాని చోటు కల్పిస్తారంటున్నారు. అర్షదీప్ సింగ్ కే ఎక్కువ అవకాశాలున్నాయి. మొత్తం మీద రాజ్ కోట్ లో రాణిస్తేనే సిరీస్ పదిలంగా ఉంటుంది. లేకుంటే సిరీస్ దక్షిణాఫ్రికా పరం అవుతుంది.
Next Story

