Fri Mar 29 2024 15:19:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తుది పోరు.. సిరీస్ ఎవరి సొంతం?
దక్షిణాఫ్రికా - ఇండియా మధ్య ఐదో మ్యాచ్ నేడు జరగనుంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది
దక్షిణాఫ్రికా - ఇండియా మధ్య ఐదో మ్యాచ్ నేడు జరగనుంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు మ్యాచ్ లలో రెండింటిని దక్షిణాఫ్రికా, రెండింటిని భారత్ గెలుచుకున్నాయి. విశాఖపట్నం, రాజ్ కోట్ లలో వరసగా గెలిచిన టీం ఇండియా సిరీస్ ను సొంతం చేసుకుంటామన్న ధీమాతో ఉంది. యువకులతో నిండి ఉన్న జట్టు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలోపేతం కావడంతో తమదే విజయమని భావిస్తుంది. సీనియర్లు లేకుండానే ఈ సిరీస్ లో బరిలోకి దిగిన టీం ఇండియా తొలి రెండు మ్యాచ్ లు ఓడినా, తర్వాత తేరుకుని విజయాలను నమోదు చేసుకుంది. ఆ ఆత్మవిశ్వాసం జట్టులో స్పష్టంగా కన్పిస్తుంది. బెంగళూరులోనూ తమదే విజయమని టీం ఇండియా ప్లేయర్లు చెబుతున్నారు.
ఎలాంటి మార్పులు లేకుండానే....
మరోవైపు దక్షిణాఫ్రికా వరసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోవడంతో కొంత డీలా పడింది. కొందరు ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. ప్రధానంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా గత టీ 20 మ్యాచ్ లో గాయాలపాలయ్యాడు. కేశవ్ మహరాజ్ కు జట్టు బాధ్యతలను అప్పగించనున్నారు. రాజ్కోట్ లో జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్ లో 87 పరుగులతో ఓడిపోవడం కూడా కొంత మానసికంగా జట్టు ఇబ్బంది పడుతుందంటున్నారు. భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది.
Next Story