Sat Dec 06 2025 00:19:43 GMT+0000 (Coordinated Universal Time)
హారికను ఓడించిన దివ్య.. తర్వాతి లక్ష్యం
మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్కు చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్కు చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికతో జరిగిన టైబ్రేక్లో 19 ఏళ్ల దివ్య 2–0తో విజయం సాధించింది. ఈ ఇద్దరి మధ్య రెండు గేమ్లు ముగిశాక స్కోరు 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ నిర్వహించారు. సెమీఫైనల్స్ తొలి గేమ్లలో టింగ్జీ లె (చైనా)తో భారత్ కు చెందిన గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి; టాన్ జోంగితో దివ్య తలపడతారు. భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు సెమీఫైనల్ చేరుకోవడంతో ఒక పతకం ఖాయమైంది. ప్రపంచకప్ టోర్నీలో టాప్–3లో నిలిచిన ప్లేయర్లు ప్రపంచ చాంపియన్ ప్రత్యర్థిని నిర్ణయించే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు.
Next Story

