Fri Apr 19 2024 11:04:17 GMT+0000 (Coordinated Universal Time)
40 ఏళ్ల వయసులో బంగారు పతకం సాధించిన శరత్ కమాల్
టేబుల్ టెన్నిస్ లో అచంట శరత్ కమాల్ గోల్డ్ మెడల్ ను సాధించాడు.
టేబుల్ టెన్నిస్ లో అచంట శరత్ కమాల్ గోల్డ్ మెడల్ ను సాధించాడు. మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు చెందిన లియామ్ పిచ్ ఫోర్డ్ ను 4-1తో ఓడించాడు. మొదటి గేమ్ లో లియామ్ పిచ్ ఫోర్డ్ రాణించినప్పటికీ మిగిలిన గేమ్స్ లో మాత్రం శరత్ కమాల్ దూకుడుగా ఆడాడు. 5 గేముల పాటూ సాగిన ఈ మ్యాచ్ లో శరత్ కమాల్ 11-13, 11-07,11-2, 11-6, 11-8 తో విజయాన్ని అందుకున్నాడు.
ఇక లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ లో పసిడి పతకం నెగ్గాడు. లక్ష్యసేన్ ఫైనల్లో మలేషియాకు చెందిన ట్సే యోంగ్ ఎన్జీపై విజయం సాధించాడు. తొలి గేమ్ ను 19-21తో కోల్పోయిన లక్ష్యసేన్ ఆ తర్వాత వరుసగా 21-9, 21-16తో రెండు గేములు చేజిక్కించుకుని కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించాడు.
Next Story