Thu Dec 18 2025 07:32:15 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా అంతమయ్యేది అప్పుడే : డబ్ల్యూహెచ్ఓ
డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనవరల్ టెడ్రోస్ అథనోమ్ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కరోనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పీక్ స్టేజ్ కు,

ప్రపంచమంతా మాయదారి కరోనా మహమ్మారితో అల్లాడిపోతోంది. కోవిడ్ పేరు చెబితేనే వణికిపోతున్నాయి ప్రపంచ దేశాలు. ఎక్కడైనా.. ఏదైనా కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చిందంటే చాలు.. దాని వెనుక కోవిడ్ మూలాలున్నాయా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ ఇలా పలు రకాలుగా ప్రజలపై దాడి చేస్తోంది ఈ మహమ్మారి. ఇది ఎప్పుడు పూర్తిగా అంతరించిపోతుందా ? అని ఎదురుచూస్తున్న ప్రజలకు డబ్ల్యూహెచ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనవరల్ టెడ్రోస్ అథనోమ్ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కరోనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పీక్ స్టేజ్ కు, వ్యాక్సినేషన్ కు లింక్ పెట్టారు. ఈ ఏడాది జూన్ - జులై నెలల మధ్యలో ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయితే.. కరోనా ప్రభావం కూడా తగ్గుతుందని టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు. అప్పుడే కరోనా పీక్ స్టేజ్ ముగిసే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే జరిగితే.. ఈ ఏడాది చివరి నాటికి కరోనా మహమ్మారి ముగింపు దర్శకు చేరుకోవచ్చని పేర్కొన్నారు.
Next Story

