Sat Mar 21 2026 00:13:38 GMT+0530 (India Standard Time)
అభ్యర్థులను ప్రకటించిన ఒవైసీ
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎంఐఎం బరిలోకి దిగుతుంది.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎంఐఎం బరిలోకి దిగుతుంది. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో వంద స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. కొన్ని చిన్న పార్టీలతో కలసి ఆయన తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారు.
9 మంది అభ్యర్థులను.....
తాజాగా అసుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి విడతగా తొమ్మిది మంది ఎంఐఎం అభ్యర్థులను ఒవైసీ ప్రకటించారు. ఇప్పటికే ఒవైసీ పలుమార్లు యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యూపీ ఎన్నికల్లో కీలకంగా తాము మారతామని అసదుద్దీన్ ఒవైసీ చెబుతున్నారు.
- Tags
- mim
- uttar pradesh
Next Story

