Sun Mar 15 2026 10:24:27 GMT+0530 (India Standard Time)
నేడు "భారత్ పోల్" ప్రారంభం
నేరస్థులను ట్రాక్ చేసి పట్టుకునేందుకు భారత్ పోర్టల్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు

జాతీయ, అంతర్జాతీయ నేరస్థులను ట్రాక్ చేసి పట్టుకునేందుకు ప్రత్యేక పోర్టల్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. దీనికి భారత్ పోల్ అని నామకరణం చేశారు. సీబీఐ రూపొందించిన ఈ పోర్టల్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. భారత్ లో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదనిఇండియాలోనే ఎక్కడో ఒకచోట తలదాచుకుని ఉన్నా వారిని సులువుగా కనిపెట్టే వీలుంది.
క్రిమినల్స్ ను పట్టుకునేందుకు...
ఈ పోర్టల్ లో భారత్ పోలీసులు క్రిమినల్ రికార్డులు షేర్ చేయగలిగితే ఆ విరాలను అందుకుని అక్కడ పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకునే అవకాశముంది. నేరగాళ్లు ఎక్కడ తలదాచుకున్నా వారిని ట్రాక్ చేసి పట్టుకునే టెక్నాలజీని నేడు అమిత్ షా ప్రారంభించనున్నారు. ఇప్పడు అవలంబిస్తున్న అనేక విధానాలకు ఈ పోర్టల్ తో ముగిసేలా చేస్తుందని సీబీఐ అధికారులు చెబుతున్నారు. సత్వరమే నేరగాళ్లను పట్టుకున్నందున ఆ కేసు కూడా త్వరితగతిన పరిష్కారమవుతుందని భావిస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

