Wed May 21 2025 01:41:52 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoor : ఇద్దరు మహిళ అధికారులే ట్రెండింగ్.. ఇద్దరు నేపథ్యమేంటంటే?
ఆపరేషన్ సిందూర్ గురించి ఇద్దరు మహిళ అధికారులు భారత ప్రజలకు వివరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది

ఆపరేషన్ సిందూర్ గురించి ఇద్దరు మహిళ అధికారులు భారత ప్రజలకు వివరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీరిద్దరూ ఎవరు? వీరు ఏ విభాగంలో పనిచేస్తున్నారు? అన్నది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఆపరేషన్ సిందూర్ గురించి ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషి తో పాటు ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఆఫీసర్ వ్యోమికా సింగ్ వివరించడంతో వీరిద్దరిపై పెద్దయెత్తున దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మహిళల నుదుటన బొట్టును చిదిమేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మన దేశం మహిళ అధికారులతోనే సమాధామనమిచ్చినట్లయింది.
కల్నల్ సోఫియా ఖురేషి ఎవరంటే?
కల్నల్ సోఫియా ఖురేషి భారత సైన్యానికి చెందిన అధికారి. సైనిక విన్యాసాలలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగాసోఫియా ఖురేషి ఘనత సాధించారు.2016లో, భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసాలైన ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో ఆమె భారత జట్టుకు నాయకత్వం వహించారు. ఇందులో పాల్గొన్న పెద్దనిమిది బృందాలలో ఖురేషి ఏకైక మహిళా కమాండర్. గుజరాత్కు చెందిన ఖురేషి బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఆమె కుటుంబానికి సైనిక నేపథ్యం ఉంది. ఖురేషి తాత భారత సైన్యంలో పనిచేశారు, ఆమె భర్త కూడా అధికారిగా పనిచేశారు. గతంలో సోఫియా ఖురేషి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాల ఆరు సంవత్సరాలు సేవలందించారు.
వ్యోమికా సింగ్ క్లిష్టమైన సమయంలో...
ఇక మరో మహిళ అధికారి వ్యోమికా సింగ్ ఐఏఎఫ్ బ్యాడ్జ్ కు కాలిఫై అయిన అధికారి. చిన్నప్పటి నుంచే ఎయిర్ ఫోర్స్ అంటే మక్కువ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాలన్న ఆమె కల నిజమయింది. అందులో జాయిన్ అయిన వ్యోమికా సింగ్ హెలికాప్టర్ పైలెట్ గా పనిచేశారు. అందులో రాణించి 2019లో ఫ్లైయింగ్ బ్రాంచ్ లో పర్మినెంట్ కమిషన్ కు అర్హత పొందారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ చేతక్, చీతా హెలికాప్టర్లను ఆపరేట్ చేసిన వ్యోమికా సింగ్ అందరి దృష్టిలో పడ్డారు. అనేక రెస్క్యూ ఆపరేషన్ లో వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. కీలక భూమిక పోషించారు. దీంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపినమేజర్ మిషన్ ను ఈమె లీడ్ చేశారు. అనేక ఆపరేషన్ లో పాల్గొన్న వ్యోమికా సింగ్ ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డారు. ఇప్పుడు ఆపరేషన్ సిందూరను వివరించి మరోమారు ట్రెండింగ్ లోకి వచ్చారు. వీరిద్దరికి దేశ ప్రజలు అభినందనలు చెప్పాల్సిందే.
Next Story