Wed May 14 2025 05:15:30 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కాల్పుల విరమణపై భారత్ అధికారిక ప్రకటన
పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో కాల్పుల విరమణకు భారత్ - పాకిస్తాన్ లు అంగీకరించాయని విదేశాంగ కార్యదర్శి మిస్రీ చెప్పారు

పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో కాల్పుల విరమణకు భారత్ - పాకిస్తాన్ లు అంగీకరించాయని విదేశాంగ కార్యదర్శి మిస్రీ చెప్పారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. కాల్పుల విరమన ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి అమలులోలోకి వచ్చిందని మిస్రి తెలిపారు. కాల్పుల విరమణను భారత్ కూడా అధికారికంగా ప్రకటించింది.
ఎల్లుండి నుంచి చర్చలు...
ఎల్లుండి నుంచి తదుపరి చర్చలు ఇరు దేశాల మధ్య ఉంటాయని చెప్పింది. గత మూడు రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను నెలకొన్న నేపథ్యంలో భారత్ - పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది. ఇరుదేశాలు అంగీకారంతోనే కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింద.ి
Next Story