Thu Jan 29 2026 03:03:53 GMT+0000 (Coordinated Universal Time)
రెండు రాష్ట్రాల్లో బీజేపీదే హవా
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు త్రిపురలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. నాగాలాండ్ లో యాభై స్థానాలలో బీజేపీ కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మేఘాలయలో మాత్రం పోటా పాటీగా కొనసాగుతున్నాయి.
మేఘాలయలో మాత్రం...
త్రిపురలో 42 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉండగా, కమ్యునిస్టు పార్టీలు పది స్థానాల్లోనే మెజారిటీ కొనసాగుతుంది. నాగాలాండ్ లో 37 స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. మేఘాలయలో మాత్రం ఎన్పీపీ ఆధిక్యంలో ఉంది. నాగాలాండ్, త్రిపురలో మాత్రం బీజేపీ హవా కొనసాగుతుంది.
Next Story

