Thu May 22 2025 06:33:54 GMT+0000 (Coordinated Universal Time)
రైలు ప్రమాదానికి అసలు కారణమదే.. పన్నెండు మంది మృతి మెయిన్ రీజన్ అదేనట
మహారాష్ట్రలోని జలగావ్ లో నిన్న జరిగిన రైలు ప్రమాదం దుర్ఘటన కేవలం ప్రచారాన్ని నమ్మడమే

మహారాష్ట్రలోని జలగావ్ లో నిన్న జరిగిన రైలు ప్రమాదం దుర్ఘటన కేవలం ప్రచారాన్ని నమ్మడమే. రైల్లో మంటలు వ్యాపించాయని ప్రచారం జరగడంతో ప్రయాణికులు ఒక్కసారి పానిక్ కు గురయ్యారు. ఈ ఘటనలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదిహేను మంది వరకూ గాయాలపాలయ్యారు, మంటలు తమ బోగీకి అంటుకుంటాయని కదులుతున్న రైలును ఆపివేసి మరీ అందులో నుంచి దూకడంతో పక్క ట్రాక్ పై వస్తున్న మరొక రైలు కింద పడి వీరు మరణించారని రైల్వే అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. ముంబయికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేజీ - పర్ధాడె స్టేషన్ల మధ్య నిన్న లక్నో -ముంబయి పుష్పక్ ఎక్స్ ప్రెస్ నుంచి దూకి ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
చైన్ లాగీ దూకడంతో...
మంటలు తమ బోగికి అంటుకుంటాయని భావించి ప్రయాణికులు చెన్ లైగి రైలు నుంచి చూసుకోకుండా దూకడం వల్లనే పక్క ట్రాక్ నుంచి వస్తున్న రైలు ఢీకొట్టింది. ఆ సమయంలో బెంగళూరు - ఢిల్లీ కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో రావడంతో ప్రయాణికులు దాని కింద పడి చనిపోయారు. రైలు బ్రేకులు వేసేందుకు కూడా సరైన సమయం లేదని అందుకే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెిపారు. పుష్పక్ ఎక్స్ ప్రెస్ ఆగిఉన్న విషయాన్ని ఫ్లాష్ లైట్ వేసి కొంత ప్రయత్నించారని అయితే రైలు అంత స్పీడ్ లో వస్తున్నందున ఆపడం సాధ్యం కాలేదని, అందుకే ప్రమాద తీవ్రత అంతగా ఉందని రైల్వే అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు.
పొగలు రావడంతోనే...
అయితే కదులుతున్న రైలులో పొగలు రావడం వల్ల మంటలు వ్యాపించాయన్న వదంతులు పుట్టాయని, దానిని ప్రయాణికులు కూడా నమ్మి తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఒక్క ఉదుటన కిందకు దూకడంతోనే ప్రాణాలు కోల్పోయారన్నారు. రైలులో ఉన్నవారంతా సేఫ్ గా ఉన్నారని చెప్పారు. అయితే చక్రాల రాపిడి వల్ల నిప్పురవ్వలు చెలరేగాయని, దాని వల్ల స్వల్పంగా పొగ వచ్చిందని రైల్వే అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. మంటలు చెలరేగాయిని కొందరు వదంతులు సృష్టించడం వల్లనే ప్రయాణికులు భయాందోళనలకు గురై రైలులో నుంచి దూకారని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కూడా తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
Next Story