Fri Dec 12 2025 06:48:37 GMT+0000 (Coordinated Universal Time)
శివకాశిలో పేలుడు... నలుగురి మృతి
నూతన సంవత్సరం మొదటి రోజున తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. బాణా సంచా పేలి నలుగురు మృతి చెందారు.

నూతన సంవత్సరం మొదటి రోజున తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. బాణా సంచా పేలి నలుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని శివకాశి బాణీ సంచా తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ ప్రతి ఇంట్లో బాణ సంచా తయారీ కుటీరపరిశ్రమగా భావిస్తారు.
బాధితుల సంఖ్య....
ఈ సమయంలో ఒక బాణాసంచా తయీారీ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. పేలుడులో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Next Story

