Thu May 16 2024 13:21:14 GMT+0000 (Coordinated Universal Time)
రేపు, ఎల్లుండి భారత్ బంద్ !
రోడ్డు, రవాణా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్ కం ట్యాక్స్, కాపర్ వంటి రంగాలకు చెందిన
న్యూ ఢిల్లీ : దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు మార్చి 28,29 తేదీల్లో భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపింది. రేపు, ఎల్లుండి జరిగే భారత్ బంద్ కు పలు రంగాలకు చెందిన కార్మికులు కూడా మద్దతిస్తున్నారు.
రోడ్డు, రవాణా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్ కం ట్యాక్స్, కాపర్ వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మె నోటీసులను జారీ చేశాయి. అలాగే రైల్వే, రక్షణ రంగాకు చెందిన సంఘాలు సైతం భారత్ బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఇదిలా ఉండగా.. భారత్ బంద్ జరిగే ఈ రెండ్రోజులు ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story