Sat Dec 06 2025 04:25:19 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు భారత్ లో ఎన్ని కరోనా కేసులుంటే?
ఈరోజు దేశంలో 196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎలాంటి మరణం సంభవించలేదు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఫోర్త్ వేవ్ ప్రజలను వణికిస్తుంది. చైనాలో ఇరవై ఐదు కోట్ల మంది వైరస్ బారిన పడినట్లు వెలువడుతున్న వార్తలు సంచలనంగా మారాయి. బీఎఫ్ 7 వేరియంట్ అతి వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు సయితం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ నిబంధనలను...
భారత్ లో కూడా కోవిడ్ నిబంధనలను పాటించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అన్ని రాష్ట్రాలకు జారీ చేసింది. అన్ని విమానాశ్రయాలలో స్క్రీనింగ్ టెస్ట్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈరోజు దేశంలో 196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎలాంటి మరణం సంభవించలేదు. ప్రస్తుతం దేశంలో 3,428 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
Next Story

