Sat May 18 2024 11:25:30 GMT+0000 (Coordinated Universal Time)
ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి
రాజ్్నంద్ గావ్ లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించినట్లు తెలిసింది.
రాజ్్నంద్ గావ్ లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించినట్లు తెలిసింది. ఈ ఘటన పోలీసు వర్గాల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాజ్ నంద్ గావ్ లో ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు.
గాలింపు తీవ్రం...
ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ రాజేష్, కానిస్టేబుల్ లలిత్ మరణించారని పోలీసు అధికారులు ధృవీకరించారు. బోర్త్ లాబ్ పోలీస్ స్టేషన్ దగ్గర మావోయిస్టులు జరిపిన దాడిలో వీరిద్దరూ మరణించారని చెబుతున్నారు. దీంతో పోలీసులు, భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
Next Story