Wed May 21 2025 04:23:19 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoora : ఈరోజు రాత్రికి కూడా పాక్ దాడులు జరిపే అవకాశం.. నిఘా సంస్థల హెచ్చరికలు
పాకిస్తాన్ - భారత్ మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ ను ప్రకటించింది

పాకిస్తాన్ - భారత్ మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ ను ప్రకటించింది. ఈ రాత్రికి కూడా దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో సరిహద్దు రాష్ట్రాల్లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. సైరన్లు మోగిస్తూ ఎవరూ ఐదు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటకు రావద్దని సూచించారు. అలాగే ఇళ్లలో లైట్లను కూడా ఎవరూ వేయద్దని కోరుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఈ ఉద్రిక్తతలు ఇంకా తొలిగిపోలేదు. నిన్న రాత్రి పాకిస్తాన్ జరిపిన దాడులను దృష్టిలో ఉంచుకుని దేశమంతా హై అలెర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, పంజాబ్, జమ్ము రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ను ప్రకటించారు.
నిరంతరం అప్రమత్తం చేస్తూ...
రాకపోకలపై కూడా నిషేధం విధించారు. భద్రతాదళాలు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. బంకర్లలోనే తలదాచుకోవాలని కూడా సూచిస్తున్నారు. పాక్ రాత్రి వేళ మాత్రమే దాడులు నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన భారత్ ఆర్మీ అందుకు సిద్ధమయింది. ఇటు నేవీ అటు ఆర్మీ, వైమానిక దళాలు నిరంతరం సరిహద్దు ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. జనావాసాలను పాక్ లక్ష్యంగా చేసుకుని దాడులు దిగుతుండటంతో ముందస్తు చర్యలకు భారత భద్రతాదళాలు దిగాయి. ఈరోజు కూడా జమ్మూ, ఉదంపూర్,అఖ్నూర్, పూంఛ్, రాజస్థాన్ లోని జైసల్మేర్, పో్ఖ్రాన్, పంజాబ్ లోని పఠాన్ కోట్, జలందర్, సత్వారా, సాంబా, ఆర్ఎస్ పురాల్లో ప్రాంతాల్లో హై అలెర్ట్ ను ప్రకటించారు. వ్యాపారులు కూడా దుకాణాలను మూసివేసి ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.
సరిహద్దు గ్రామాల ప్రజలు...
ఈరోజు రాత్రి గడిస్తే చాలు అన్న రీతిలో సరిహద్దు గ్రామాల ప్రజలు బితుకు బితుకు మంటూ గడుపుతున్నారు. అయితే శుక్రవారం కావడంతో పాక్ దాడులకు తెగపడుతుందా? లేదా? అన్న అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయినా నిన్న అప్రమత్తంగా ఉండటం వల్లనే సమర్థవంతంగా తిప్పికొట్టగలిగామని, ఈరోజు కూడా దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు అందిన సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతాదళాలు మొహరించాయి. ఉగ్రవాదులు సరిహద్దుల నుంచి చొరబడకుండా నిరంతరం నిఘా పెట్టారు. పోలీస్ స్టేషన్లు, ఆర్మీక్యాంప్ లను పాక్ టార్గెట్ చేసే అవకాశముందని భావిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఎటు నుంచి దాడులకు దిగినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. రాత్రి వేళ బాంబుల మోతతో సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందా? అన్న ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Next Story