Wed Jan 21 2026 00:58:37 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై వేటు
కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ను తొలగించారు

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ను తొలగించారు. ఆయనకు ఎర్త్ అండ్ సైన్స్ శాఖకు అప్పగించారు. న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల న్యాయశాఖ మంత్రిగా ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కిరణ్ రిజిజును ఆ పదవి నుంచి తప్పించారని తెలుస్తోంది.
ఆయన స్థానంలో...
2021 జులై 8వ తేదన కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేతగా ఆయనకు బాధ్యతలను అప్పగించినా సక్రమంగా పనిచేయలేకపోయారన్న అభిప్రాయం ఉంది. ప్రధాని మోదీ కూడా రిజిజు పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. అందుకే ఆయనను ముఖ్యమైన న్యాయశాఖ నుంచి తప్పించారని సమాచారం.
Next Story

