Fri Dec 05 2025 12:23:39 GMT+0000 (Coordinated Universal Time)
రైలు ప్రమాదం : నలుగురి మృతి
బీహార్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు

బీహార్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో నలుగురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ నుంచి గౌహతి లోని కామాఖ్య జంక్షన్ కు రైలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఈ రైలు ప్రయాణిస్తుండగా పట్టాలు తప్పి ప్రమాదం తప్పింది.
పట్టాలు తప్పి...
ఐదు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదరుగా పడిపోయాయి. రైలు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రైల్వే సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. పట్టాలు తప్పడానికి కారణాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖ ఉన్నతాధికారులను కోరింది.
Next Story

