Fri Dec 05 2025 18:03:03 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు బ్లాక్ ఉందని పంజాబ్ ప్రభుత్వం చెప్పలేదు
పంజాబ్ లో ప్రధాని మోదీని అడ్డుకోవడం పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భద్రత లోపంపై విచారణ జరిపింది

పంజాబ్ లో ప్రధాని మోదీని అడ్డుకోవడం పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భద్రత లోపంపై విచారణ జరిపింది. రోడ్డు బ్లాక్ లో ఉందని పంజాబ్ ప్రభుత్వం చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం తరుపున న్యాయవాది చెప్పారు. ఈ ఘటనకు ఖలిస్తాన్ గ్రూపు కారణమని అనుమామని తెలిపింది. భద్రతచర్యలు చేపట్టే బాధ్యత ఎస్పీజీ గ్రూపుదేనని పేర్కొంది.
విచారణలో ఎన్ఐఏ టీం....
అయితే ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం విచారణను చేపట్టకూడదని, విచారణ టీంలో ఎన్ఐఏ ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే తాము ముందుగానే సమాచారం ఇచ్చామని, ఎస్పీజీ గ్రూపు తమ సలహాలను పాటించలేదని పంజాబ్ ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు.
Next Story

