Sat Dec 06 2025 00:47:22 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని భద్రత వైఫల్యం విచారణకు కమిటీ
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతాలోపంపై సుప్రీంకోర్టు విచారణ కమిటీని నియమించింది

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతాలోపంపై సుప్రీంకోర్టు విచారణ కమిటీని నియమించింది. రిటైర్డ్ జడ్జి ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పూర్తిస్థాయిలో విచారించి భద్రత లోపాలకు గల కారణాలు, ఎవరి వైఫల్యం వంటి విషయాలను విచారించనుంది.
సభ్యులుగా...
ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఛండీఘడ్ డీజీపీ, ఏఎన్ఐ ఐజీ , పంజాబ్ సెక్యూరిటీ ఐజీ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

