Thu Jan 29 2026 20:14:55 GMT+0000 (Coordinated Universal Time)
సిద్దేశ్వర స్వామి కన్నుమూత
జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి మరణించారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు

జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి మరణించారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. కర్ణాటక, మహారాష్ట్రలలో స్వామి వారికి అనేక మంది భక్తులున్నారు. సోమవారం సాయంత్రం కర్ణాటకలోని వజియపుర కేంద్రంలోని ఆశ్రమంలో ఆయన మరణఇంచారు. ఈ మేరరకు విజయపుర డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేష్ ప్రకటించారు.
పాఠశాలలకు సెలవులు...
స్వామి వారికి పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో రెండు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. స్వామి వారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని కర్ణాటక సర్కార్ ఆదేశించింది. స్వామి వారి మృతికి సంతాప సూచకంగా విజయపుర జిల్లాలలో పాఠశాలలకు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రముఖులు ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

