Wed May 08 2024 00:51:08 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంలో ఉద్ధవ్ కు షాక్
సుప్రీంకోర్టులో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కు షాక్ తగిలింది
సుప్రీంకోర్టులో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కు షాక్ తగిలింది. అసలైన శివసేన ఎవరిదని గుర్తించే అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ అధికారం ఎన్నికల కమిషన్ కు ఉందని తెలిపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలను చేపట్టిన ఏక్ నాథ్ షిండే వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించి ఈ వ్యాఖ్యలను చేసింది.
ఈసీకి ఆ అధికారం...
మహారాష్ట్రలో శివసేన నుంచి వేరు కుంపటి పెట్టుకుని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో కలసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మెజారిటీ ప్రకారం శివసేన పార్టీ కూడా తమదేనని షిండే పిటీషన్ వేశారు. ఆ అధికారం ఈసీకి లేదని ఉద్ధవ్ ధాక్రే పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కు శివసేన ఎవరిది అని గుర్తించే అధికారం ఉందని చెప్పింది.
Next Story