Fri Dec 05 2025 07:15:45 GMT+0000 (Coordinated Universal Time)
ములాయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు చెబుతున్నారు

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు చెబుతున్నారు. గత వారం రోజుల నుంచి ఆయన హర్యానా గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, లైఫ్ సేవింగ్ మెడికేషన్ కొనసాగిస్తున్నట్లు మేదాంత మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ గుప్తా మీడియాకు తెలిపారు.
ఐసీయూలో...
వారం రోజుల క్రితం ములాయం సింగ్ అనారోగ్యానికి గురి కావడంతో హుటాహుటిన ఆయనను మేదాంత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత ఐసీయూలో ఉంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలువురు నేతలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆసుపత్రి వద్దకు వచ్చి ఆయనను పరామర్శించి వెళుతున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story

