Sun Mar 15 2026 16:34:44 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో మకర జ్యోతి దర్శనం
శబరిమల భక్తులతో పోటెత్తింది. ఈరోజు మకర సంక్రాంతి కావడంతో జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరిమల చేరుకున్నారు

శబరిమల భక్తులతో పోటెత్తింది. ఈరోజు మకర సంక్రాంతి కావడంతో మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరిమల చేరుకున్నారు. జ్యోతి దర్శనం కోసమే అనేక మంది మాలలు వేసుకుంటారు. ఇరుముడిని విప్పి మకర జ్యోతి దర్శనం చేసుకుంటే మంచిదని భావిస్తారు. పంబ నుంచి కొండ వరకూ భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు.
లక్షల సంఖ్యలో...
అందుకే లక్షల సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకున్నారు. భక్తులు లక్షలాది మంది తరలి రావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశఆరు. కొండల మధ్య కనిపించే జ్యోతి దర్శనం కోసం అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వేచి చూస్తారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా గట్టి భద్రత చర్యలు చేపట్టారు. పొన్నంబల మేడు నుంచి జ్యోతి దర్శనం జరుగుతుంది.
Next Story

