రూ.17,000 కోట్ల లోన్ ఫ్రాడ్.. అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యేనా.?
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం విచారించనుంది.

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం విచారించనుంది. 17,000 కోట్ల రూపాయల రుణం మోసం కేసులో కొనసాగుతున్న విచారణలో భాగంగా అనిల్ అంబానీ ED ముందు హాజరుకానున్నారు. అనిల్ అంబానీ (66) విచారణకు హాజరైన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద అతని వాంగ్మూలాన్ని దర్యాప్తు సంస్థ నమోదు చేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఆగస్టు 1న అనిల్ అంబానీకి ఈడీ సమన్లు పంపింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సమన్లలో ఆదేశించింది.
అంతకుముందు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసి) కూడా జారీ చేయబడింది. దీని ప్రకారం.. దర్యాప్తు అధికారి అనుమతి లేకుండా అంబానీ భారతదేశం వదిలి వెళ్ళరాదు. లుకౌట్ సర్క్యులర్ తర్వాత.. ఆయన కోర్టు అనుమతి లేకుండా భారతదేశం నుండి బయటకు వెళ్ళకూడదు. అలాగే.. ఈ కేసుతో సంబంధం ఉన్న వివిధ సంస్థలు, వ్యక్తుల పాత్రపై ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది.
గత నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేక కంపెనీలు, ఆయన వ్యాపార సమూహానికి సంబంధించిన అధికారుల ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు చేసింది. జూలై 24న ప్రారంభమైన ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగింది. అంబానీ కంపెనీల ఆర్థిక అవకతవకలు, రూ. 17,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన సామూహిక రుణాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఈడీ ఈ చర్య తీసుకుంది. ఈ కేసులో ముంబైలోని 35కి పైగా చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ కేసులో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో సహా 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు ప్రమేయం ఉన్నట్లు అనుమానించింది. 2017-2019 మధ్య కాలంలో ఎస్ బ్యాంక్ నుంచి దాదాపు రూ. 3,000 కోట్ల రుణాలను అంబానీ కంపెనీలకు మళ్లించారనే ఆరోపణలపై దర్యాప్తు ప్రధానంగా సాగుతుందని ED వర్గాలు తెలిపాయి.

