Mon Feb 02 2026 00:05:26 GMT+0000 (Coordinated Universal Time)
దేశ ప్రజలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్
దేశ ప్రజలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. హై స్పీడ్ రైళ్లు త్వరలోనే వస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

దేశ ప్రజలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. హై స్పీడ్ రైళ్లు త్వరలోనే వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో త్వరలోనే హైస్పీడ్ రైళ్లు రానున్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో హైస్పీడ్ రైళ్లు వస్తున్నాయని, త్వరితగతిన గమ్యస్థానం చేరుకునే వీలుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
హై స్పీడ్ రైళ్లు...
హై స్పీడ్ రైళ్లకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయన్న అశ్వినీ వైష్ణవ్ గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా త్వరితగతిన ప్రయాణం చేయడానికి ఈ రైళ్లు ఎంతో దోహదపడతాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Next Story

