Sun Mar 15 2026 14:59:15 GMT+0530 (India Standard Time)
నేడు మూడో రోజు ఈడీ వద్దకు రాహుల్
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడో రోజు విచారణ చేయనుంది.

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడో రోజు విచారణ చేయనుంది. వరసగా రెండు రోజుల పాటు విచారించిన ఈడీ మూడో రోజు కూడా విచారణకు పిలిచింది. నిన్న కూడా 11 గంటలకు పైగానే రాహుల్ ను ఈడీ అధికారులు విచారించారు.
మౌనమే....
అనేక విషయాలపై రాహుల్ స్టేట్మెంట్ ను నమోదు చేసిినట్లు తెలిసింది. మనీలాండరింగ్ కు సంబంధించి రాహుల్ గాంధీని ప్రశ్నించగా రాహుల్ గాంధీ సమాధానం చెప్పలేదంటున్నారు. ఈడీ ప్రశ్నల్లో ఎక్కువ వాటికి రాహుల్ మౌనం వహించారని తెలుస్తోంది. మూడో రోజు కూడా రాహుల్ ను ఈడీకి విచారణకు పిలవడంతో కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది
Next Story

