Tue Feb 03 2026 05:04:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు యూపీలో ప్రధాని... కారిడార్ ప్రారంభం
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోదీ నేడు పర్యటించనున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోదీ నేడు పర్యటించనున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 800 కోట్ల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాధ్ కారిడార్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మోద పర్యటన కోసం విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.
యూపీ ఎన్నికలకు....
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాని మోదీ వరసగా ఆ రాష్ట్ర పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని వరస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story

