Thu Dec 18 2025 17:54:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ముంబయికి ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముంబయిలో పర్యటించనున్నారు. రెండు వందే భారత్ రైళ్లను ఆయన ప్రారంభించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముంబయిలో పర్యటించనున్నారు. రెండు వందే భారత్ రైళ్లను ఆయన ప్రారంభించనున్నారు. వందేభారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ట్రాఫిక్ ఆంక్షలు...
ముంబయిలో ప్రధాని పర్యటన ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయాలనుకున్న వారిని ముందస్తు అరెస్టులు చేసినట్లు తెలిసింది. భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నారు.
Next Story

