Fri Dec 19 2025 22:24:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కర్ణాటకలో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. శివమొగ్గలో విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. శివమొగ్గలో విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. శివమొగ్గలో 450 కోట్ల రూపాయలతో విమానాశ్రయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. గంటకు మూడు మంది ప్రయాణికులకు సేవలందించేలా ఈ ఎయిర్పోర్టును నిర్మించారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిచనుండటంతో పార్టీ నేతలు ఇప్పటికే శివమొగ్గకు చేరుకున్నారు.
శివమొగ్గ విమానాశ్రయాన్ని...
శివమొగ్గ విమానాశ్రయంలో కమలం ఆకారంలో నిర్మించిన టెర్మినల్ పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ ఏడాదిలో ప్రధాని మోదీ ఇప్పటికే కర్ణాటకలో పర్యటిస్తుండటం ఇది ఐదో సారి. త్వరలో ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కమలం పార్టీ శక్తివంచన లేకుండా పనిచేస్తుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
Next Story

