Fri Dec 05 2025 18:26:42 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు కన్యాకుమారికి మోదీ.. మూడు రోజులు ధ్యానంలోనే
నేడు కన్యాకుమారిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు మోదీ కన్యాకుమారిలోనే ఉండనున్నారు

నేడు కన్యాకుమారిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు మోదీ కన్యాకుమారిలోనే ఉండనున్నారు. జూన్ 1వ తేదీ వరకూ అక్కడే ధ్యానం చేస్తూ గడపాలని మోదీ నిర్ణయించుకున్నారు. ఈరోజుతో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. కొన్ని నెలలుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మనసు ప్రశాంతత కోసం కన్యాకుమారికి చేరుకుంటున్నారు.
భారీ భద్రత ఏర్పాట్లు...
కన్యాకుమారిలో నరేంద్ర భగవతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మోదీ తిరువళ్లూరు విగ్రహాన్ని సందర్శించనున్నారు. మోదీ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు కన్యాకుమారిలోనే ప్రధాని ఉండటంతో హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

