Sat Mar 14 2026 19:29:37 GMT+0530 (India Standard Time)
Narendra Modi : నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన చీఫ్ సెక్రటరీల సమావేశం జరగనుంది. మొత్తం మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. వికసిత్ భారత్ -2047 లక్ష్యం చేరుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా చీఫ్ సెక్రటరీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం...
ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం బలోపేతం ప్రధాన అజెండా చర్చ జరగనుంది. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, ఫ్రాంటియర్ టెక్నాలజీలు, బెస్ట్ ప్రాక్టీస్ లపై ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీలు చర్చించనున్నారు. దీనిపై ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలను నివేదిక రూపొంలో తయారు చేయనున్నారు. ఈ సమావేశం కీలకం కావడంతో ప్రధాని మోదీ స్వయంగా హాజరై చీఫ్ సెక్రటరీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

