Tue Jan 20 2026 18:30:44 GMT+0000 (Coordinated Universal Time)
నూతన పార్లమెంటుకు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు హాలును సందర్శించారు

ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు హాలును సందర్శించారు. మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని ఆకస్మిక తనిఖీని ప్రధాని నిర్వహించారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో భవనాన్ని సందర్శించి సమీక్షించారు. ఈ సందర్భంగా అక్కడ పనివారితో ముచ్చటించారు.
సూచనలు...
కొన్ని సూచనలు చేశారు. నూతన పార్లమెంటు భవనంలో మోదీ దాదాపు గంటసేపు ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రధాని నరేంద్ర మోదీ వెంట ఉన్నారు. టాటా ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Next Story

