Sat May 04 2024 18:53:02 GMT+0000 (Coordinated Universal Time)
మోడీకి బైడెన్ ప్రత్యేక ఆహ్వానం
ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.
ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. అమెరికాలో పర్యటించాల్సిందిగా మోదీని బైడన్ కోరారు. జీ 20 సమావేశానికి ముందు అమెరికాలో పర్యటించాలని, వేసవిలో పర్యటనను ప్లాన్ చేసుకోవాలని బైడన్ సూచించినట్లు తెలిసింది.
తేదీల కోసం...
దీనికి మోదీ కూడా సానుకూలత తెలిపినట్లు సమాచారం. పీఎంవో వర్గాలు కూడా దీనిని ధృవీకరించాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేలా మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుందని చెబుతున్నారు. ఇరు దేశాల అధికారులు పర్యటన తేదీలపై కసరత్తులు చేస్తున్నారు. 2021 తర్వాత తిరిగి మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆరోగ్య భద్రత, ఆరోగ్యం, వాతావరణ సంక్షోభం, స్వేచ్చ వంటి అంశాలపై ఇరు దేశాల అగ్రనేతల మధ్య చర్చలు జరిగే అవకాశముందని తెలిపాయి.
Next Story