Sun Mar 08 2026 09:01:13 GMT+0530 (India Standard Time)
పుల్వామా అమర జవాన్లకు మోదీ నివాళులు
పుల్వామా అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పుల్వామా ఉగ్రవాద జరిగి నేటికి మూడేళ్లయింది

పుల్వామా అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పుల్వామా ఉగ్రవాద జరిగి నేటికి మూడేళ్లయింది. పాక్ ఉగ్రవాదులు భారత సైనికులపై దాడి చేసి నలభై మంది జవాన్ల ప్రాణాలను బలితీసుకు్నారు. జమ్మూ నుంచి సైనికులు వెళుతుండగా ఈ దాడి జరిగింది. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా నలభై మంది భారత జవాన్లు మృతి చెందారు.
ప్రతీకారంగా....
పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14న ఈ దాడి జరిగిందని, దేశానికి వారు అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మోదీ తెలిపారు. జవాన్ల ధైర్యసాహసాలు ఎప్పటికీ భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించింది.
Next Story

