Sat Dec 06 2025 12:24:26 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు
ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ను మోదీ ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేశారు. భారత్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకతో భారత్ ప్రపంచ దేశాల సరసన చేరిందని మోదీ ప్రశంసించారు. భారత్ శక్తిమంతమైన దేశంగా తయారయిందనడానికి ఇది ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. భారత్ తలచుకుంటే సాధ్యమేదీ కాదని మరోసారి నిరూపితమయిందన్నారు.
స్వదేశీ సాంకేతికతో...
స్వదేశీ సాంకేతికతో ఈ అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తయారయిందన్నారు. ఈ నౌక ద్వారా 30 యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను తీసుకెళ్లే వీలుంది. ఈ నౌకలో 1700 మంది సిబ్బంది ఉంటారు. ప్రపంచ దేశాల సరసన భారత్ చేరడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. దీనిని రూపొందించిన వారిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. దీంతో భద్రత వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.
Next Story

