Sat Mar 14 2026 16:23:02 GMT+0530 (India Standard Time)
Narendra Modi : అయోధ్య మందిరంలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. అయోధ్య చేరుకున్నమోదీకి ఆలయ పండిలుతు స్వాగతం పలికారు. ముందుగా సప్తర్షి ఆలయాల్లో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అన్నపూర్ణాదేవి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం బాలరాముడి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సప్తమందిరాన్ని సంర్శించుకున్న మోదీ మాతా అన్నపూర్ణదేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయాన్ని సందర్శించి...
వందటన్నుల పూలతో ఆయోధ్య రామాలయ నిర్మాణాన్ని ఈ సందర్భంగా అలంకరించారు. మొత్తం ఏడు వేల మందిని ఈ కార్యక్రమానికి అనుమతించారు. శేషావతార మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో కాషాయ జెండాను మోదీ ఆవిష్కరించనున్నారు. అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం చేయనున్నారు.
Next Story

