Wed Mar 18 2026 22:03:45 GMT+0530 (India Standard Time)
Narendra Modi : మోదీకి అత్యున్నత పురస్కారం
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం లభించింది

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం లభించింది. ప్రధాని మోదీని ‘గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ తో ఇథియోపియా ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ నేతగా ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఇవాళ ఇథియోపియా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
ఒమన్ కు చేరుకుని...
ఇథియోపియా పర్యటన అనంతరం ఒమన్కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ప్రధాని ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఒమన్ దేశంతో సత్సంబంధాలను నెలకొల్పే దిశగా మోదీ వారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నాలుగు రోజుల్లో ఒమన్, ఇథియోపియా, జోర్డాన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఆ యా దేశాల్లో ప్రముఖులతో సమావేశమై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై చర్చించనున్నారు.
Next Story

