Fri Dec 05 2025 11:30:42 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రైతులకు ఖుషీ కబురు చెప్పిన మోదీ
ప్రధాని రైతులకు గుడ్ న్యూస్ ప్రకటించారు. కిసాన్ సమ్మాన్ నిధిని ఆరు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు మోదీ ప్రకటించారు.

ప్రధాని రైతులకు గుడ్ న్యూస్ ప్రకటించారు. కిసాన్ సమ్మాన్ నిధిని ఆరు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రధానిప్రకటనతో రైతులు కొత్త ఏడాది వేళ ఆనంద పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఏడాదికి కిసాన్ సమ్మాన్ కింద ఆరు వేల రూపాయలను రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.
పది వేలకు పెంచుతూ...
దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మొత్తాన్ని కలిపి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వమే పది వేల రూపాయలకు పెంచడంతో రతులకు ఖుషీ కబురు అని చెప్పాలి. ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసే ఈ నిధులను పెంచడాన్ని స్వాగతిస్తున్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లోనూ దీనికి కేటాయింపులు జరుపుతారు. దానికి ముందుగానే మోదీ గుడ్ న్యూస్ చెప్పారు.
Next Story

