Mon May 06 2024 15:25:01 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధానికి ఆ జబ్బు ఉంది : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
దయచేసి మీరు కూడా కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. ఎవరైనా సరే రోజుకు ఇరవై రెండు గంటలు పనిచేస్తున్నారు అంటే వారికి..
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. ఇటీవల కాలంలో పలు వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. మరోసారి వార్తలో నిలిచారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ రెండు గంటలు మాత్రమే నిద్ర పోతారని.. ఇక రోజులో 22 గంటల పాటు ఆయన పని చేస్తూనే ఉంటారు అని చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ వెటకారంగా ట్వీట్ చేశారు.
"దయచేసి మీరు కూడా కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. ఎవరైనా సరే రోజుకు ఇరవై రెండు గంటలు పనిచేస్తున్నారు అంటే వారికి ఏదైనా జబ్బు ఉంది అని గమనించాలి. నిద్రపోలేకపోవడం అనేది అతి పెద్ద జబ్బు.వైద్య పరిభాషలో దీనిని ఇన్సోమ్నియా అని పిలుస్తారు. ఈ జబ్బు గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు వెంటనే ఆ జబ్బుతో బాధ పడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి." అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవ్వగా.. నెటిజన్లు ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story