Wed May 08 2024 19:44:42 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉత్తర్ ప్రదేశ్ లో చివరి విడత పోలింగ్ ముగిసింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉత్తర్ ప్రదేశ్ లో చివరి విడత పోలింగ్ ముగిసింది. ఈ నెల 10వ తేదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నికలు కేంద్ర ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా నిర్వహించింది.
చివరి విడత.....
అక్కడక్కడ రీపోలింగ్ జరిగినా మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు చివరి విడత ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. మరికాసేపట్లో వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎవరి పరం అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story