Fri Dec 05 2025 23:48:43 GMT+0000 (Coordinated Universal Time)
రాజీ కుదిరింది : కేసీ వేణుగోపాల్
సిద్ధారామయ్యను కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.

సిద్ధరామయ్యను కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. డీకే శివకుమార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటారని తెలిపారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఒక్కరే ఉంటారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఎల్లుండి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన తెలిపారు.
ఎల్లుండి ప్రమాణం...
డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ గా కూడా కొనసాగుతారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇద్దరి మధ్య అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎల్లుండి మంత్రి వర్గంలో కొందరు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అయితే పవర్ షేరింగ్ విషయంపై మాత్రం కేసీ వేణుగోపాల్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. తమ ప్రభుత్వం ప్రజలతోనే ఉంటుంని ఆయన తెలిపారు.
Next Story

