Wed May 21 2025 05:33:59 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మళ్లీ పాక్ డ్రోన్లతో దాడులకు దిగిన పాక్
పాకిస్తాన్ ఈరోజు కూడా సరిహద్దు రాష్ట్రాల్లో కాల్పులకు దిగింది. జమ్మూలో కాల్పులు ప్రారంభమయ్యాయి.

పాకిస్తాన్ ఈరోజు కూడా సరిహద్దు రాష్ట్రాల్లో కాల్పులకు దిగింది. జమ్మూలో కాల్పులు ప్రారంభమయ్యాయి. సాంబా సెక్టార్ లో కొన్ని పాక్ డ్రోన్లను భారత్ వైమానిక దళం కూల్చివేసిందన్న వార్తలు వస్తున్నాయి. జమ్మూలో కాల్పులు, పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ, సాంబా, పఠాన్నకోట్ లలో పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత్ బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి.
దీటుగా ఎదుర్కొంటున్న భారత్ ...
జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా బాక్ల్ అవుట్ ప్రకటించారు. పోఖ్రాన్ దగ్గర కూడా పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత్ వైమానిక దళం కూల్చివేసింది. మొత్తం ఏడు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించినట్లు సమాచారం అందుతుంది. అలాగే సరిహద్దుల్లో కూడా పాక్ రేంజర్లు కాల్పులు కొనసాగిస్తున్నారు. వీటిని సమర్థవంతంగా భారత బలగాలు ఎదుర్కొంటున్నాయి.
Next Story